విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు.

క్రీడాకారులకు సర్టిఫికెట్లు విజేతలకు మెడల్స్అందజేత.

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు.

విజయవంతంగా ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు.

క్రీడాకారులకు సర్టిఫికెట్లు విజేతలకు మెడల్స్అందజేత.

kridalu..2

హైదరాబాద్ మే 31 (మీడియా ఫోకస్ ):తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాలు ఈరోజు తో ముగిసాయి. ఏప్రిల్ 15 నుండి మే 31 వరకు జంట నగరాల్లో ఆరు స్టేడియాల్లో, 32 జిల్లా కేంద్రాల్లో మే ఒకటి నుంచి మే 31వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహింపబడ్డ ఈ శిబిరాలు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు నగరంలోని స్టేడియాల లో మరియు 32 జిల్లా కేంద్రాల్లో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడ్డాయి.

 

 క్రీడాకారులకు సర్టిఫికెట్లు విజేతలకు మెడల్స్

 

 ఈ వేసవి శిక్షణ శిబిరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా, పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ సర్టిఫికెట్, ఇంటర్నల్ కాంపిటీషన్స్ లో విజేతలైన వారికి మెడల్స్ ను అందజేశారు. ఆయా జిల్లాల్లో రెవిన్యూ పోలీస్ శాఖలతోపాటు వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు జిల్లా యువజన క్రీడాభివృద్ధి శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎల్బీ స్టేడియం ముగింపు వేడుకలకు స్పోర్ట్స్ అథారిటీ ఉపసంచాలకులు శ్రీమతి శ్రీలత, ముఖ్యఅతిథిగా హాజరు కాగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మనీషా, ప్రముఖ టీవీ ఆర్టిస్టులు సంజయ్ మురళి శ్రీకాంత్ లు హాజరైనారు.సైకిల్ వేలోడ్రం స్టేడియంలో జరిగిన వేడుకలకు స్పోర్ట్స్ అథారిటీ ఉపసoచాలకులు శ్రీమతి శ్రీలత,ధనలక్ష్మి,చంద్రారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణి ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ మ్యాక్స్వెల్ ట్రావెర్, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ రాయబాగి ప్రసాద్ లు హాజరైనారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి జిఎంసి బాలయోగి స్టేడియం గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమానికి ఎం వి ఆర్ గ్రూప్ సంస్థ చైర్మన్ మూల వెంకటేష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా డివైఎస్ఓ వెంకటేశ్వరరావు వెంకయ్య చౌదరి, కోచులు తదితరులు హాజరైనారు. రేపు ఉదయం ఒకటవ తేదీ నాడు జింఖానా గ్రౌండ్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు నిర్వహించిన మోటివేషన్ క్లాసెస్ ఇంటర్నల్ కాంపిటీషన్స్ పిల్లలకు మెడల్స్ క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం