సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..

బీసీల రిజర్వేషన్ల పెంపు తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. దాసు సురేష్ -బీసీ రాజ్యాధికార సమితి

సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..

సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..

 

- మున్ముందు ఎన్నికలను రద్దుచేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వేలం వేస్తారేమో.

-మా ఓట్లతో గెలిచిన పార్టీలు సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేయడం న్యాయమేనా?

-పెరుగుతున్న అంతరాలతో దేశంలో అంతర్యుద్ధానికి అవకాశం..

-సామాజిక న్యాయ సాధన తోనే దేశం సుభిక్షం.,

­­-దేశవ్యాప్త కుల గణనతోనే ఇది సాధ్యం.

-ప్రజాభీష్టాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి గడ్డుకాలం..

-చట్టసభల్లో చట్టసభల్లో బీసీలకు ప్రవేశం ఆవశ్యం.

-ప్రాంతీయ పార్టీలను, ఉద్యోగ,విద్యార్థి మేధావి లోకాన్ని ఏకం చేసి ఉద్యమ ఉధృతి పెంచుతాం.

-బీసీల రిజర్వేషన్ల పెంపు తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.

-దాసు సురేష్ -బీసీ రాజ్యాధికార సమితి

 

 న్యూ డిల్లీ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్);బ్రిటిష్ పరిపాలనను తలదన్నేలా నేడు దేశంలో ఉన్నత, నిమ్న వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు తీవ్రమయ్యాయని ., ఈ పరిస్థితులు దేశంలోఅంతర్ యుద్ధానికి దారితీసేలా ప్రమాదాన్ని సూచిస్తున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సంపన్నులు మరింత సంపన్నులుగా పేదలు కడు పేదలుగా మారుతుండటం దయనీయమన్నారు..సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకని ధ్వజమెత్తారు..మున్ముందు ఎన్నికలను రద్దుచేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వేలం వేస్తారేమోననే అనుమానం కలుగుతుందన్నారు..మా ఓట్లతో గెలిచిన పార్టీలు సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేయడం న్యాయమేనా అని దాసు సురేశ్ ప్రశ్నించారు..ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం మారుతున్న వాతావరణన్ని స్పష్టపరుస్తుందన్నారు.ఒక శాతం సంపన్నుల వద్ద బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఇరవై ఒక్క శాతం ఆదాయాన్ని మించి నేడు ఒక శాతం సంపన్నుల వద్ద 23% దేశ ఆదాయం స్థిరీకరింప బడటాన్ని చూస్తే ప్రభుత్వం అగ్రవర్ణ సంపన్నుల కోసం పనిచేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అన్నారు. నేడు దేశంలో 271 మంది బిలియనీర్లలో ఉండగా కేవలం 2023లోనే 94 మంది కొత్తగా బిలియనీర్లుగా మారడం… అందులో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేకపోవడం చూస్తే దేశంలో కొనసాగుతున్న ఆర్థిక అంతరాలను స్పష్టపరుస్తుందన్నారు. దేశ సంపద, భూమి, వనరులు, ప్రాజెక్టులు 77% మేరకు అత్యంత సంపన్న 10 శాతం వద్ద నిక్షిప్తమై ఉండగా… పేద వర్గాల వద్ద ఉన్నది 4.1% అని దాసు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదవారు మరింత పేదరికంలోకి జారుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రస్తుత పరిస్థితులు దేశ భద్రత, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తెలిపారు. కొనసాగుతున్న ఈ అంతరాలను సామాజిక న్యాయ సాధన ద్వారానే అరికట్టవచ్చని… అందుకు దేశ వ్యాప్త కులగననే బ్రహ్మాస్త్రం అని అని దాసు సురేష్ తెలిపారు. దేశంలో 52% జనాభా కలిగిన బీసీలు నేటికీ విద్య, ఉద్యోగ అవకాశాలను అందుకోవడంలో వెనుకబడుతున్నారని… ఈ అన్యాయాన్ని వ్యక్తీకరించడానికి అవసరమైన బీసీల ప్రాతినిధ్యం చట్టసభల్లో లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకోసం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రవేశపెడుతున్న ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు రాజకీయాలకతీతంగా మద్దతు నివ్వాలన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడాని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజాభీష్టాన్ని విస్మరిస్తే రాజకీయ పార్టీలకు గడ్డుకాలం తప్పదన్నారు. తక్షణమే బీసీలకు 27% రాజకీయ రిజర్వేషన్లను పార్లమెంటు, అసెంబ్లీలో కల్పించి ప్రధాని మోడీ బీసీల పట్ల విశ్వసనీయతను నిరూపించుకోవాలన్నారు. దేశంలో సామాజిక, న్యాయ సాధనకు అవసరమైన కులగణనను ప్రారంభించి 2018లో అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్లో పేర్కొన్న విధంగా బిజెపి తమ నిబద్ధతను నిరూపించుకోవాలన్నారు. కులగణన నిర్వహణ, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, బడ్జెట్లో బీసీలకు సబ్ ప్లాన్, క్రిమిలేయర్ తొలగింపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, EWS రిజర్వేషన్ల రద్దు లేదా ఆర్థికంగా వెనుకబడ్డ అన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్ల వర్తింపు తదితర అంశాల సాధనకే ఢిల్లీ కేంద్రంగా విద్యార్థి ,ఉద్యోగ, మేధావి, కార్మిక, కర్షక వర్గాలను, ప్రాంతీయ పార్టీలను మమేకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో పాటు బలమైన భవిష్యత్ కార్యాచరణ నిర్మాణాన్ని గావిస్తామని దాసు సురేష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సైతం బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని లేకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి ముఖ్య నేతలు మారేపల్లి లక్ష్మణ్ నేత, సీనియర్ జర్నలిస్టు దుర్గం శ్రీనివాస్,యువ నాయకులు కావలి రాజు, మల్లేష్ నేత, సేనాపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Media focus Editor Nagaraju Picture

 Editor  of MEDIA FOCUS FOR PEOPLE News paper and senior journalist since from 2009 worked in various news paper as  an executive editor, Buero Incharge, CEO.

In addition, we maintain (www.mediafocusnews. com) a news website. Similarly we are also managing Digital Paper (ePaper) www.epaper.mediafocusnews. com. We publish every news item coming to this site based on the certification of the authorities. Area, Village, Zonal and District wide reporters for our paper collect news and send it via e-mail or WhatsApp. They will be edited by the sub-editors and then published on the website and in the newspaper.

Related Posts

Latest News

రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!? రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?
రాడర్ స్టేషన్ కోసం..12 లక్షల చెట్లు కొట్టేస్తారా..!?  ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు కుమారి యామినీ లక్ష్మీహైదరాబాద్ ఆగష్టు 9 (మీడియా ఫోకస్ న్యూస్ )వికారాబాద్ జిల్లా...
ఎసిబి వలలో భారీ తిమింగలం. 
ఆదివాసీల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తా
సంపన్న వర్గ ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వాలు మాకెందుకు..
క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు
తాను శాసనసభలో కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది.
సుప్రీం కోర్టు తీర్పు 20 ఏళ్లుగా పోరాటం విజయం